Samayam Telugu•General•2 సెప్టెం
కరీంనగర్లో బావిలోకి దూసుకెళ్లిన బస్సు.. బయటపడ్డ 54 మందిప్రయాణికులు
కరీంనగర్లో బావిలోకి దూసుకెళ్లిన RTC బస్సు.. బయటపడ్డ 54 మంది ప్రయాణికులు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో ఘోర బస్సు ప్రమాదం త్రుటిలో తప్పింది. కరీంనగర్ నుండి హుస్నాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి, పక్కనే ఉన్న ఒక వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 54 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రయాణికులంతా స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మూడు రోజుల క్రితమే రిపేర్ చేయించినా ఇలా జరిగిందని డ్రైవర్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వార్తకు సంబంధించిన