© 2026 nimisham.in

లగ్జరీ ఎస్యూవీ విభాగంలో సంచలనం సృష్టించేలా ల్యాండ్ రోవర్ కంపెనీ రేంజ్ రోవర్ సిరీస్ లో తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ఎస్యూవీని తీసుకొచ్చింది.
భారత్లో ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీకి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ధరను మాత్రం కంపెనీ ఇంకా ప్రకటించలేదు. స్టాండర్డ్ వీల్బేస్లో ఆటోబయోగ్రఫీ, ఫస్ట్ ఎడిషన్ వేరియంట్లతో పాటు లాంగ్ వీల్బేస్లో ఎస్వీ, ఎస్వీ అల్ట్రా, ఎస్వీ బ్లాక్ వేరియంట్లను భారత్లో అందించనున్నారు.బ్యాటరీ, పవర్..రేంజ్ రోవర్ ఎలక్ట్రిక్లో 118.5 kWh ఉపయోగించగల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇందులో 344 ప్రిస్మాటిక్ సెల్స్ ఉన్నాయి. 800V ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్ను ఉపయోగించారు. రెండు పర్మనెంట్ మాగ్నెట్ ఎలక్ట్రిక్ మోటార్లు కలిపి 542 hp పవర్, 850 Nm టార్క్ ఇస్తాయి. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే డబ్ల్యూఎల్టీపీ లెక్కల ప్రకారం 600 కి.మీ వరకు ప్రయాణించవచ్చని ల్యాండ్ రోవర్ చెబుతోంది.22 నిమిషాల్లో 10-80 శాతం ఛార్జింగ్ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ 350kW వరకు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. అనుకూలమైన ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగిస్తే బ్యాటరీని 10 నుంచి 80 శాతానికి సుమారు 22 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. గరిష్ఠ ఛార్జింగ్ రేట్తో కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 125 మైళ్ల వరకు డ్రైవింగ్ రేంజ్ లభిస్తుందని పేర్కొంది.ఆఫ్రోడింగ్లోనూ తగ్గేదేలేఎలక్ట్రిక్ మోడల్లో కొత్త ట్రాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. ఇది కేవలం 50 మిల్లీసెకన్లలో స్పందించగలదని కంపెనీ చెబుతోంది. వివిధ రకాల రోడ్లపై గ్రిప్ను మెరుగుపరచడంతో పాటు ఆఫ్రోడ్ సామర్థ్యాన్ని కొనసాగించేలా దీన్ని