© 2026 nimisham.in
కొందరు ఉడకబెట్టిన గుడ్లు చల్లారితే.. వాటిని వేడి చేసి తింటూ ఉంటారు. అయితే ఉడికించిన గుడ్డును దాని పెంకుతో పాటు మైక్రోవేవ్లో ఎప్పుడూ మళ్లీ వేడి చేయకూడదు.
గుడ్డు లోపల ఆవిరి పేరుకుపోవచ్చు, వేడిగా ఉన్న గుడ్డును బయటకు తీసి పగలగొడితే అది పేలే ప్రమాదం ఉంది. మీరు ఉడికించిన గుడ్డును వేడి చేయాలనుకుంటే, ముందుగా దాని పెంకు తీసి ముక్కలుగా కోసి, ఆ తర్వాత నెమ్మదిగా వేడి చేయండి. మైక్రోవేవ్లో గుడ్డు వంటకాలను వేడి చేస్తున్నప్పుడు అవి సమానంగా వేడెక్కేలా చూసుకోవడానికి వాటిపై మూత పెట్టండి, వాటిని తిప్పండి లేదా కలపండి.
సాంబార్, గ్రేవీ, కూర, పాస్తా సాస్ వంటి చిక్కగా ఉండే ఆహారాల్లో మైక్రోవేవ్ వేడి ఒకేలా చేరకపోవచ్చు. ఒక చోట చల్లగా ఉంటే మరో చోట చాలా వేడిగా ఉండొచ్చు. అందుకే పాత్రను కవర్ చేసి కొద్దిసేపు వేడి చేసిన తర్వాత బయటకు తీసి బాగా కలపాలి. అవసరమైతే మళ్లీ కొద్దిసేపు వేడి చేయాలి.
కొందరు పచ్చిమిర్చిని కట్ చేయకుండా దాన్ని అలానే వేడి చేస్తూ ఉంటారు. మొత్తం పచ్చిమిర్చిని మైక్రోవేవ్లో వేడి చేస్తే వాటిలోని క్యాప్సైసిన్ అధికంగా ఉండే నూనెలు ఆవిరైపోయి, కారం పదార్థం నుంచి వచ్చే ఆవిరి ముక్కు, కళ్లకు ఇబ్బంది కలిగించవచ్చు. అందుకే మొత్తం మిర్చిని నేరుగా వేడి చేయకుండా చిన్న ముక్కలుగా కోసి కూర లేదా ఇతర ఆహారంలో కలిపి వేడి చేయడం మంచిది.
అన్నం విషయంలో మైక్రోవేవ్ కంటే దాన్ని ఎలా నిల్వ చేశామన్నదే చాలా ముఖ్యం. ఉడికించిన అన్నాన్ని ఎక్కువసేపు బయట ఉంచితే బ్యాసిల్లస్ సీరస్ అనే బ్యాక్టీరియా పెరిగి సమస్యలు కలిగించే టాక్సిన్లు తయారయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మైక్రోవేవ్లో వేడి చేసినా ఆ టాక్సిన్లు పూర్తిగా పోతాయని చెప్పలేము. అందుకే మిగిలిన అన్నాన్ని వీలైనంత త్వరగా ఫ్రిజ్లో పెట్టాలి.
పకోడీలు, సమోసాలు, ఫ్రైడ్ చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వాటిని మైక్రోవేవ్లో వేడి చేస్తే క్రిస్పీగా కాకుండా మెత్తగా మారిపోవచ్చు. వీటికి పాన్, ఓవెన్, ఎయిర్ ఫ్రయ్యర్ మంచి ఆప్షన్. చేపలు, ఇతర సీఫుడ్ను ఎక్కువసేపు వేడి చేస్తే గట్టిగా, రబ్బర్లా మారొచ్చు. తక్కువ వేడితో కొద్దిసేపు వేడి చేయడం మంచిది. సీఫుడ్ను వేడి చేసేముందు ముందు కొద్దిగా నీరు కలపండి. ఇది ముక్క రబ్బరులా మారకుండా, మెత్తగా ఉండేలా చేస్తుంది.
ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోండి. అలాగే వీటిని ఎంత వరకు పాటించాలనేది, విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.
రచయిత గురించికిషోర్ రెడ్డికిషోర్ రెడ్డి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2020లో సమయం తెలుగులో చేరిన కిషోర్ రెడ్డి లైఫ్స్టైల్కి సంబంధించిన న్యూట్రిషియన్, డైట్ ప్లాన్, రోగాలు - లక్షణాలు, ఫిట్నెస్, ఇంటి చిట్కాలు, ఫ్యాషన్, హోమ్ డెకార్, రిలేషన్షిప్ వార్తలతో పాటు వివిధ ఆరోగ్య అంశాలపై ఆరోగ్య నిపుణులు, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్లు, ఆయుర్వేద నిపుణులు ఇచ్చిన సలహాలు, సమాచారం ఆధారంగా విస్తృత స్థాయిలో వార్తల్ని రాశారు. అంతేకాకుండా క్లీవ్ ల్యాండ్ క్లినిక్, మాయో క్లినిక్, WHO, హార్వర్డ్ వంటి పరిశోధనలు ఆధారంగా కూడా కంటెంట్ అందించారు. ఈ సమాచారాన్ని నిజమో కాదో తెలుసుకోవడానికి నిపుణుల సలహా తీసుకోమని కూడా వివరించారు. ఈ ఆర్టికల్స్ పాఠకులకు అర్థమయ్యేలా సరళమైన భాషలో రాస్తారు.కిషోర్ రెడ్డి 2015లో సాక్షి జర్నలిజం స్కూల్లో జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం సాక్షి న్యూస్ ఛానెల్లో (20.08.2016 నుంచి 23.03.2020 వరకు) సబ్ ఎడిటర్గా పనిచేశారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్, విద్య, ఉద్యోగం వార్తలు రాశారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ / జాబ్స్ సెక్షన్ చూసుకునేవారు. ఆ తర్వాత 02.04.2020 నుంచి సమయం తెలుగులో విద్య, ఉద్యోగ వార్తలతో పాటు టెక్నాలజీ న్యూస్, అడ్వర్టయిజ్మెంట్స్ కూడా రాశారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, ప్రముఖల ఇంటర్వ్యూలు చూడటం, కొత్త కొత్త అంశాల గురించి తెలుసుకోవడానికి ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి