
అందుకే కోహ్లీ-అనుష్క లండన్ లోస్థిరపడ్డారు
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Kohli) తన కుటుంబంతో కలిసి కొన్నాళ్లుగా లండన్లో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. టీమ్ఇండియా మ్యాచ్లు ఉన్నప్పుడు, ఐపీఎల్ సీజన్ సమయంలో మాత్రమే అతడు భారత్కు వస్తున్నాడు. దీంతో కోహ్లీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్కు గురయ్యాడు. అయితే, విరాట్ భారత్ను వీడి విరాట్ లండన్లో నివసించడానికి గల కారణాన్ని బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ భర్త డా.శ్రీరామ్ నేనే తాజాగా బయటపెట్టారు. లండన్కు వెళ్లడానికి ముందు అనుష్క శర్మతో జరిపిన ఆసక్తికర సంభాషణను డా.శ్రీరామ్ యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియాతో జరిగిన ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. తమకున్న స్టార్డమ్ కారణంగా భారత్లో కోహ్లీ-అనుష్క సాధారణ జీవితాన్ని గడపలేకపోతున్నారని, అందుకే లండన్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారని తెలిపారు. పబ్లిక్ అటెన్షన్కు దూరంగా ప్రశాంతమైన జీవితాన్ని గడిపేందుకు వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కోహ్లీ దంపతులు తమ పిల్లలు వామికా, అకాయ్లను మీడియా దృష్టికి దూరంగా ఉంచి సాధారణంగా పెంచాలనుకుంటున్నారని తెలిపారు. మరోవైపు, టెస్టులు, టీ20లకు గుడ్ బై చెప్పిన కోహ్లీ.. వన్డే మ్యాచ్లు, ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో భారత్కు వస్తున్నాడు. ఇక, 2018లో విడుదలైన ‘జీరో’ చిత్రం తర్వాత అనుష్క శర్మ నటనకు దాదాపు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఆమె ‘చక్దా ఎక్స్ప్రెస్’లో నటించారు. ఇందులో అనుష్క మాజీ భారత క్రికెటర్ ఝులన్ గోస్వామి పాత్రను పోషించారు. అయితే, ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఆమె 2022లో తన నిర్మాణ సంస్థ ‘క్లీన్ స్లేట్ ఫిల్మ్స్’ బాధ్యతల నుంచి వైదొలిగి కుటుంబ బాధ్యతలు చూసుకుంటోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు






















