హైదరాబాద్ కంటోన్మెంట్ లో ఆర్మీ ఆయుధాలు చోరీ.. తుపాకులు ఎత్తికెళ్లిన దొంగలు
హైదరాబాద్ కంటోన్మెంట్లో ఆర్మీ ఆయుధాలు చోరీ.. తుపాకులు ఎత్తికెళ్లిన దొంగలు హైదరాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని మద్రాస్ రెజిమెంట్లో ఆయుధాల చోరీ కలకలం రేపింది. ఆయుధాలు భద్రపరిచే రూం తాళం పగులగొట్టి 12 ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రిని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఆర్మీ ఫిర్యాదు మేరకు బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యంత భద్రత ఉండే ప్రాంతంలోకి బయటి వ్యక్తుల ప్రవేశం పరిమితంగా ఉండటంతో లోపలి వ్యక్తుల ప్రమేయంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మల్కాజిగిరి పోలీస్ ఉన్నతాధికారులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు అసలు వార్తా మూలంలో అందుబాటులో ఉన్నాయి


























